హైదరాబాద్ : చేపల వేటకు(Fishing) వెళ్లి వ్యక్తి మృతి(Man died )చెందిన సంఘటన మెదక్(Medak) జిల్లా నిజాంపేట మండలం నస్కల్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటయ్య (48) నస్కల్ గ్రామ శివారులోని వాగులో చేపలు పట్టడానికి వెళ్లాడు.
చేపలు పడుతున్న క్రమంలో వెంకటయ్య వాగులో ఉన్న లోతైన గుంతలోకి కాలు జారడంతో నీళ్లలో మునిగి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుని భార్య కళావతి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వెంకటయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.