జగిత్యాల, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క ల్యాణలక్ష్మి పథకంతోపాటు తులం బం గారం ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నా యకుడు, నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి హామీ ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా కల్యాణలక్ష్మి, తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం మైతాపూర్, బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామాల్లో సోమవా రం కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు.
జీవన్రెడ్డి 15వసారి ఎలక్షన్లో నిలబడుతున్నారని, 45 ఏండ్లుగా ఎలక్షన్లలో కొట్లాడుతూనే ఉన్నారని గుర్తు చేశా రు. ఎప్పుడు పోటీ చేసినా ఇవే తన ఆఖరి ఎన్నికలు అంటూ వ్యాఖ్యానించి ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని ధ్వజమెత్తారు. జీవన్రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇం కా రెండేళ్లు ఉన్నప్పటికీ ఎంపీ కోసం పో టీ చేస్తున్నారని తెలిపారు. నలభై ఏండ్లు గా ప్రజా జీవితంలో ఉన్న జీవన్రెడ్డి గల్ఫ్ కార్మికుల గురించి ఎందుకు పట్టించుకోలేదని, ఇప్పుడే గల్ఫ్ కార్మికులు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ, జీవన్రెడ్డి చెప్పే మాటలను నమ్మవద్దని కోరారు. సమావేశాల్లో బీజేపీ నాయకులు సత్యనారాయణరావు, బోగ శ్రావణి పాల్గొన్నారు.