న్యూఢిల్లీ: కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంస్థలు ఇప్పుడు దానిని శాశ్వతంగా కొనసాగించాలని భావిస్తున్నాయి. తాజాగా బీసీజీ-జూమ్ నిర్వహించిన సర్వేలో 87 శాతం సంస్థలు శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపినట్లు తేలింది. అంతేకాదు కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసే వాళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు కూడా ఈ సర్వే స్పష్టం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలపై పడిన ఆర్థిక ప్రభావం, వీడియో కమ్యూనికేషన్స్ చూపిన పరిష్కారాలపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి జూమ్ ఈ సర్వే నిర్వహించింది.
ప్రపంచంలో ఇండియా సహా ఆరు దేశాల్లోని ప్రధాన రంగాలపై వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావాన్ని ఈ సర్వే అధ్యయనం చేసింది. ఇండియా, యూఎస్, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీలలో ఈ సర్వే నిర్వహించారు. సర్వే జరిపిన సంస్థలలో వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలు మూడు నుంచి ఐదు రెట్లు పెరిగినట్లు గుర్తించారు. ఇక సర్వేలో భాగంగా మేనేజర్ స్థాయి ఉద్యోగులను ఇంటర్వ్యూ చేయగా.. అందులో 70 శాతం మంది రిమోట్ వర్కింగ్కు అనుకూలంగా ఓటేశారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవగా, అటు చాలా మంది తమ ఉద్యోగాలు కూడా నిలుపుకున్నారు. ఒక్క యూరప్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా 22.8 లక్షల ఉద్యోగాలు నిలిచాయి.
ఇవి కూడా చదవండి..
ఆవుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి తులాభారం.. 85 కేజీల వెండి విరాళం
రాహుల్గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం