దిబ్రూగఢ్ : అసోంలోని సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. 223 మందికి పరీక్షలు చేయగా.. 53 మందికి వైరస్ సోకిందని దిబ్రూగఢ్ డెప్యూటీ కమిషన్ పల్లవ్ గోపాల్ ఝా తెలిపారు. జైలులోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వైరస్ సోకిన ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా ఉందని, వీరిని మెరుగైన చికిత్స కోసం అసోం మెడికల్ కాలేజీకి తరలించినట్లు చెప్పారు. మరికొంత మంది ఖైదులు వైరస్కు పాజిటివ్గా పరీక్షించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం దిబ్రూగఢ్ జిల్లాలో 4,206 క్రియాశీల కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. నిన్న అసోంలో 6,143 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. 89 మంది వైరస్ బారినపడి మృతి చెందారని ఆరోగ్యశాఖ తెలిపింది. 48,390 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య అసోం ప్రభుత్వం లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కదలికలపై నిషేధం విధించగా.. ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు మినహాయింపు ఇచ్చారు.