షిల్లాంగ్ : మేఘాలయలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ జయంతి హిల్స్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. జోవాయి పట్టణ శివార్లలోని మిహ్మింట్డు గ్రామంలో బావి నిర్మిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ప్రత్యేక రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని మరో ఇద్దరిని రక్షించింది. రెస్క్యూ బృందం 35 మీటర్ల లోతులో ఉన్న బావిలో నుంచి వివిధ చోట్ల పడి ఉన్న ఐదుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు ఫైర్ సర్వీస్ ఎస్సీ గొయెంకా తెలిపారు. కార్మికులు నీటిని తోడేందుకు వినియోగిస్తున్న పైపు నుంచి పొగరావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని పేర్కొన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన కార్మికులు చికిత్స పొందుతున్నారని వివరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..