– మాజీ ఎంపీపీ పోలగోని సత్యం గౌడ్
మునుగోడు, ఏప్రిల్ 02 : బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని మాజీ ఎంపీపీ పోలగోని సత్యంగౌడ్, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని చౌరస్తాలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 316వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన ప్లెక్సీకి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీడిత జనుల కోసం, బహుజుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పాలకూరి నరసింహ గౌడ్, పాలకూరి యాదయ్య గౌడ్, మాదగోని రాజేష్ గౌడ్, మారగోని అంజయ్య గౌడ్, సురిగి చలపతి గౌడ్, గురిజ రామచంద్రం, ఐతగోని లాల్ బహుదూర్, గుంటోజు వెంకటాచారి, ఈదులకంటి కైలాస్ గౌడ్, పోలగోని ప్రకాష్ గౌడ్, జాజుల స్వామి గౌడ్, సురిగి నరసింహ గౌడ్, పంతంగి స్వామి గౌడ్, ఐతగోని విజయ్ గౌడ్, బొడ్డు చంద్రమౌళి, అనంత శ్రీనివాస్, సోమగొని రమేష్ గౌడ్, నేలపట్ల వెంకన్న పాల్గొన్నారు.