కాబూల్ : పాకిస్తాన్కు చెందిన 24 మంది మహిళలు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని వివిధ జైళ్లలో ఉన్నారు. ఈ మహిళలతో వారి పిల్లలు కూడా ఉన్నారు. ఈ మహిళలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, వారికి సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్ఘాన్ జైలులో ఉన్న పాకిస్తాన్ మహిళల్లో ఎక్కువ మంది ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఖోరాసన్ గ్రూపుతో సంబంధం కలిగి ఉన్నట్లుగా తెలుస్తున్నది. పాకిస్తాన్ ప్రభుత్వ పత్రాలను ఒక వార్తా సంస్థకు ఇచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పత్రాలను కాబూల్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఇస్లామాబాద్లోని తమ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
వార్తా సంస్థ ప్రకారం, పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నది. గత వారం పాకిస్తాన్ అధికారుల బృందం రహస్యంగా కాబూల్లోని పుల్-ఏ-చార్కి జైలుకు వచ్చింది. ఐఎస్ వంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు పాకిస్తాన్ మహిళలు ఈ జైలులో ఉన్నారు. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఇస్లామాబాద్లోని విదేశాంగ శాఖకు ఒక లేఖ రాసింది. ఇందులో మహిళా ఖైదీలందరి సమాచారం, వారిపై వచ్చిన అభియోగాల వివరాలు వివరించారు. ఈ లేఖ ప్రకారం మహిళలందరూ ఐఎస్ కోసం పనిచేస్తున్నారు.
దేశంలో ఐఎస్ చురుకుగా లేవని, ఈ సంస్థతో పాకిస్తానీకి ఎలాంటి సంబంధం లేదని ప్రధాని ఇమ్రాన్ఖాన్, పాకిస్తాన్ ఆర్మీ, విదేశాంగ శాఖ ప్రత్యేక ప్రకటనల్లో వేర్వేరుగా స్పష్టం చేశారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని పాక్ రాయబార కార్యాలయం ఈ అబద్ధాన్ని బహిర్గతం చేసింది. ఖైదీ మహిళల చిరునామాలు, ఫోన్ నంబర్లను కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐకి ఈ మహిళల గురించి పూర్తి సమాచారం ఉన్నదని బ్లూమ్బెర్గ్ తన రెండు నివేదికల్లో పేర్కొన్నది.
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
చరిత్రలో ఈరోజు : 41 ఏండ్ల క్రితమే హాంకాంగ్ ఫ్లూ మహమ్మారి
హేమంత విజ్ఞప్తి : ముస్లింలు జనాభాను నియంత్రించాలి
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
ఇక నిశ్చింత : కరోనా రోగుల సేవలో గ్రేస్ రోబోట్
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..