అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22న పదో తరగతి (10th Class) ఫలితాలు వెల్లడికానున్నాయి.ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఫలితాలను results.bse.ap.gov.in ద్వారా సమాచారం పొందవచ్చని సూచించారు. ఏపీ ప్రభుత్వం గత మార్చి మూడో వారం పరీక్షలను నిర్వహించారు. దాదాపు 6.3 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు.