చిన్నంబావి, ఏప్రిల్ 30 : అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు వెళ్తున్న క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
అనంతరం చిన్నంబావి మండలం దగడపల్లి నుంచి మండలకేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ ప్రయాణికులతో మాట్లాడారు. నాగర్కర్నూల్ ఎంపీగా తనను గెలిపిస్తే విద్యతోపాటు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పనిచేస్తానని హామీ ఇచ్చారు. కాగా, లక్ష్మీపల్లి స్టేజీ వద్ద వృద్ధురాలిని స్వయంగా చేతి పట్టుకొని బస్సు నుంచి కిందకు దించారు.