హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని లైబ్రేరియన్ పోస్టులు, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 3 ప్రకారం దాదాపు అన్ని నోటిఫికేషన్లకు మహిళా సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకొన్నట్టు పేర్కొన్నారు. ఈ పోస్టులకు 2022లో కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది.