కరీంనగర్ కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 135 మంది విద్యార్థులు 10 జీపీఏ, 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు.
ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది అల్ఫోర్స్ విద్యా సంస్థలు అని చెప్పారు. మొత్తం 1,140 మంది విద్యార్థుల్లో 747 మంది 9 జీపీఏ, ఆపై సాధించడం తమ విజయమని పేర్కొన్నారు.