హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంగానీ, సీఎం రేవంత్రెడ్డిగానీ స్పందించకపోవడంతో మరోసారి ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. విచారణకు స్వీకరించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన సీఎం పదవిలో ఉన్నందున కేసు విచారణ సరిగా సాగే అవకాశం లేదని మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణను మధ్యప్రదేశ్ కోర్టుకు బదిలీ చేయాలని కోరారు.
ఈ పిటిషన్పై ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆరు వారాలు దాటినా ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి నుంచి సమాధానం రాలే దు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరపాలని పిటిషనర్లు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం(మే3న) విచారణ చేపడుతామని పేర్కొన్నది.