షాబాద్/దోమ, ఏప్రిల్ 30: బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మ హేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రజల కు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, రాజేంద్రనగర్, వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రాల్లో జరిగిన పార్టీ బూత్స్థాయి ఇన్చార్జిల సమావేశంలో.. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, పార్లమెంట్ ఇన్చార్జి రాంబాబుయాదవ్తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, సీఎం పదిసార్లు వచ్చి ప్రచారం చేసినా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ బస్సుయాత్రకు అనూహ్య స్పందన వస్తున్నదని, ప్రజలు తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.