Pandem kodi : సంక్రాంతి మందు ఏపీలో కోడిపుంజుల ధరలు అమాంతం పెరిగాయి. పందెం బరిలో నిలిచే కోడి పుంజుల ధరలు బంగారం రేట్లను తలపిస్తున్నాయి. రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నాయి. పందెంకోళ్లలో సేతువ జాతిది అగ్రస్థానం. దీన్ని ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్నది. తర్వాత స్థానాల్లో పర్ల, నెమలి, పచ్చకాకి, డేగ, కాకిపుంజు, పెట్టమారు జాతులు ఉన్నాయి.
పర్ల రూ.50 వేలు, నెమలి రూ.50 వేల నుంచి రూ.60 వేలు, కాకి డేగ పర్ల రూ.25 నుంచి రూ.30 వేలు, ఎర్రకెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకిడేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ధరలు పలుకుతున్నాయి. వీటితోపాటు రసంగి, కెక్కరి, పూల, అబ్రస్, పండుడేగ, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ రకాలు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరలకు పందెంరాయుళ్లు కొనుగోలు చేస్తున్నారు. పుంజుల ప్రత్యేకతలు, సామర్థ్యం ఆధారంగా ధరలు ఉంటాయని పెంపకందారులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. కోడి పందేలకు ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా ప్రకటించారు. ఎవరైనా చట్టవ్యతిరేకంగా పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sankranti Special | పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు?
శ్రీశైలంలో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
రిపోర్టర్గా మారిన 5 ఏళ్ల చిన్నారి.. హేట్సాఫ్ అంటున్న నెటిజన్లు: వైరల్ వీడియో
పది పాసవుతానని 20 ఏండ్ల వయసులో ప్రతిజ్ఞ.. 56వ సారి 70 ఏండ్లలో పాస్