న్యూఢిల్లీ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. భవిష్యత్ భారత నిర్మాణ నిర్దేశకులు యువతే అన్న విషయాన్ని నొక్కిచెప్పారు. ఎందరో మహనీయులు మన సమాజాన్ని జాగృతం చేశారని, వారు చూపిన బాటలో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యులు ఎన్పీ వెంకటేశ్వర చౌదరి తెలుగులో రచించిన ‘కాంబోడియా.. హిందూ దేవాలయాల పుణ్యభూమి’ ‘నేటి వియత్నాం-నాటి హైందవ సంస్కృతి’ పుస్తకాలను సోమవారం న్యూఢిల్లీలోని తన నివాసం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించి ప్రసంగించారు. సనాతన కాలం నుంచి భారతదేశం, వసుధైవ కుటుంబ భావనతో ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించిందని చెప్పారు. పరాయిదేశాల నుంచి అనేక దాడులు జరిగినా.. వేళ్ళూనుకున్న బారతీయ సంస్కృతి మనకు దూరం కాలేదని తెలిపారు. ఈ విషయంలో మన ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచే కేంద్రాలుగా, విద్యాలయాలుగా, వైద్యాలయాలుగా, అన్నదాన నిలయాలుగా, గ్రంథాలయాలుగా, యోగ నిలయాలుగా, న్యాయ కేంద్రాలుగా, కళా నిలయాలుగా అనేక పాత్రలను దేవాలయాలు పోషిస్తూ వచ్చిందని వెంకయ్యనాయుడు తెలిపారు. స్వరాజ్య ఉద్యమంలో కూడా దేవాలయాల పాత్ర మరచిపోలేనిదని చెప్పారు. వేగాన్ని సంతరించుకున్న మన జీవన విధానంలో భాగంగా ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకున్నదని పేర్కొన్నారు. కంచి కామకోటి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, పుస్తక రచయిత ఎన్పీ వెంకటేశ్వర చౌదరి తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
రూ.4,450 కోట్ల నష్టాల్లో టాటా మోటార్స్
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నుంచి ఒలింపిక్స్ మెడల్స్
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
ఈ నెల 31 న భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..