ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ రూ.4,450.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.8,437.99 కోట్లుగా ఉన్నది. అంటే సంస్థ నష్టం 47 శాతం మేర తగ్గిందన్నమాట. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, కంపెనీ ఆదాయం సంవత్సరానికి 107.6 శాతం పెరిగి రూ.66,406.05 కోట్లకు చేరుకున్నది. ఏడాది క్రితం ఇది రూ.31,983.06 కోట్లు. కన్సాలిడేటెడ్ ఈబీఐటీడీఏ మార్జిన్ కూడా 8.3 శాతం వద్ద ఉన్నది.
గత ఏడాదితో పోలిస్తే భారతదేశంలో టాటా మోటార్స్ కార్యకలాపాలు బాగున్నాయని కంపెనీ తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో వృద్ధి మందగించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) మొదటి త్రైమాసికంలో సంవత్సరానికి 68.1 శాతం ఎక్కువ వాహనాలను విక్రయించింది. అదేవిధంగా, టాటా మోటార్స్ కూడా ఏప్రిల్-జూన్లో 95.2 వేల వాహనాలను విక్రయించింది.
టాటా మోటార్స్ జేఎల్ఆర్ కోసం డిమాండ్ చాలా ఉన్నది. అలాగే, భారతదేశంలో ప్రయాణికుల వాహనాల డిమాండ్ కూడా బాగానే ఉన్నది. ఏదిఏమైనా, సెమీకండక్టర్ సమస్యలు, ఖరీదైన లోహ ధరలు, మహమ్మారి అనిశ్చితుల కారణంగా సమస్యలు రెట్టింపయ్యాయి. కొవిడ్ పరిస్థితి మెరుగుపడటంతో సప్లై చైన్ సమస్యలు తొలిగి రెండవ అర్ధ భాగంలో పనితీరు మెరుగుపడుతుందని కంపెనీ ఆశిస్తున్నది. టాటా మోటార్స్ షేర్లు బీఎస్ఈలో 0.86 శాతం పడిపోయి రూ.293.10 వద్ద ముగిశాయి.
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నుంచి ఒలింపిక్స్ మెడల్స్
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
ఈ నెల 31 న భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..