లక్నో: కరోనాతోపాటు వివిధ ఫంగస్లు సతమతం చేస్తున్నాయి. ఇప్పటి వరకు పలువురు కరోనా రోగులు బ్లాక్, వైట్ ఫంగస్ బారీన పడ్డారు. తాజాగా ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక వ్యక్తికి ఎల్లో ఫంగస్ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.
బ్లాక్/ వైట్ ఫంగస్ కంటే ఎల్లో ఫంగస్ మరింత ప్రమాదకరమని తెలుస్తున్నది. ఘజియాబాద్లో ఎల్లో ఫంగస్ బారీన పడ్డ రోగి.. ఆ నగరంలోని ఈఎన్టీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
ఎల్లో ఫంగస్ బారినపడిన వారిని బద్ధకం ఆవరిస్తుంది. ఆకలి మందగిస్తుంది. బరువు తగ్గిపోతారు. ఈ వ్యాధి తీవ్రమైతే శరీరానికి అయిన గాయాలు తగ్గవు.
శరీరానికి వివిధ ప్రమాదాల్లో జరిగిన గాయాల నుంచి చీము కారుతుంది. వాటిని నివారించడం కాసింత కష్ట సాధ్యంగానే ఉంటుందని వైద్యులు అంటున్నారు.
కణజాలం దెబ్బ తినడంతో నేత్రాలకూ తీవ్ర హాని కలుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలను గుర్తించగానే చికిత్స ప్రారంభించకపోతే వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.
వివిధ అవయవాలు పని చేయకుండా ఫెయిల్యూర్ అవుతాయి. ప్రధానంగా రోగిలో అంతర్గతంగా ఇది డెవలప్ అవుతుందని తెలుస్తున్నది. దీని చికిత్సకు ఆంఫోటెరిసిన్-బీ మెడిసిన్ అందుబాటులో ఉంది.
ప్రధానంగా అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఈ వ్యాధి సోకుతుందని తెలుస్తున్నది. ఇంటి పరిసరాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఫంగస్ పెరుగుదలలో ఇంటిలోని తేమ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 8000కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
ధృతరాష్ట్రునిలా వ్యవహరిస్తున్న సోనియా : శివరాజ్ చౌహాన్
కరోనా వ్యాక్సినేషన్.. నదిలో దూకిన ప్రజలు
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
రాజస్థాన్లో 600 మందికిపైగా చిన్నారులకు అస్వస్థత.. కరోనా థర్డ్ వేవేనా?
కరోనా కల్లోలంలో దర్శనాలేమిటి మంత్రిగారూ..
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన.. సోదరుడి పెళ్లిలో తహసీల్దార్ డ్యాన్స్..
మాస్క్ లేకుండానే.. బైక్ ర్యాలీలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ