భోపాల్ : కరోనా మహమ్మారిపై ప్రజల్లో భయాందోళన రేకెత్తించేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత కమల్ నాథ్ పై చర్యలు చేపట్టాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ కోరారు. కమల్ నాథ్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మౌనం దాల్చారని ఆమె ద్రుతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
మహమ్మారి కట్టడికి తాము చర్యలు చేపడుతుండగా కాంగ్రెస్ పార్టీ అగ్గి రాజేస్తోందని ఆరోపించారు. కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో మరణాలను చూసి కాంగ్రెస్ ఆనందిస్తోందని విమర్శించారు. మరోవైపు కరోనా వైరస్ ఇండియన్ వేరియంట్ అంటూ కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేతల ఫిర్యాదు ఆధారంగా కమల్ నాథ్ పై మధ్యప్రదేశ్ లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.