బెంగళూరు: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించింది. కొన్ని రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడింది. మృతుడి సోదరి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman, Lover Kill Husband) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 50 ఏళ్ల పరమేష్ రోజువారీ కూలీ పనులు చేసేవాడు. జనవరి 29న రాత్రి వేళ అతడు గుండెపోటుతో మరణించినట్లు 46 ఏళ్ల భార్య ఆశా తన బంధువులను నమ్మించింది. ఆ మరునాడు పరమేష్ మృతదేహాన్ని ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, ఒక ఇంట్లో పని చేస్తున్న ఆశా తన భర్త చనిపోయిన 20 రోజుల్లో మరో పెళ్లి చేసుకున్నది. వంట పని చేసే ప్రియుడైన 48 ఏళ్ల చంద్రప్పను ఫిబ్రవరి 19న రెండో వివాహం చేసుకున్నది. ఈ నేపథ్యంలో పరమేష్ సోదరీమణులు అతడి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. ఒక సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మరోవైపు ఖననం చేసిన పరమేష్ మృతదేహాన్ని పోలీసులు తవ్వి తీయించారు. పోస్ట్మార్టం పరీక్ష నిర్వహించడంతోపాటు ఫోరెన్సిక్ నమూనాలు సేకరించారు. ఊపిరి ఆడకపోవడం వల్ల అతడు మరణించినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. దీంతో ఆశా, ఆమె ప్రియుడు చంద్రప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, మద్యం మత్తులో నిద్రించిన పరమేష్ ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఆశా, ఆమె ప్రియుడు చంద్రప్పను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు.. స్నేహితుడ్ని చంపి డబ్బు దొంగిలించిన వ్యక్తి
Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య
IRIS Lavan | ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడికి ముందు.. మరో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం