లక్నో: భర్త హత్య కేసులో సొంత కుమారుడిని దోషిగా అతడి తల్లి నిర్ధారించింది. ఈ మేరకు కోర్టులో సాక్ష్యం చెప్పింది. దీంతో ఆ వ్యక్తికి జీవిత ఖైదు శిక్షను కోర్టు విధించింది. ఆ మహిళ వాంగ్మూలాన్ని కీలకంగా కోర్టు భావించింది. (woman gets her own son sentenced) ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది ఏప్రిల్ 11న భూమి విషయంలో జరిగిన గొడవ కారణంగా ఛత్రపాల్ తన తండ్రిపై కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. దీంతో నిందితుడైన ఛత్రపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, ఈ హత్య కేసు విచారణ సమయంలో నిందితుడైన ఛత్రపాల్ తల్లి, సోదరుడితో సహా ఏడుగురు సాక్షులను ప్రాసిక్యూషన్ తరుఫున కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ మహిళ తన కుమారుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. తన భర్త హంతకుడు కుమారుడేనని గుర్తించింది. అతడి ముఖాన్ని మళ్ళీ చూడాలని లేదని కోర్టులో అన్నది.
మరోవైపు ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ట్రయల్ కోర్టు నిందితుడైన ఛత్రపాల్కు జీవిత ఖైదుతో పాటు లక్ష జరిమానా విధించింది. అయితే సకాలంలో నేర నిర్ధారణ జరుగడంలో నిందితుడి తల్లి సాక్ష్యం కీలకమని పేర్కొంది. ఇలాంటి నిర్ణయాత్మకమైన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ప్రాముఖ్యతను ఈ కేసు హైలైట్ చేసింది.
Also Read:
Air India flight U-turn over China | కెనడా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. చైనా గగనతలంలో యూటర్న్
Watch: 18 మంది నిందితులను పబ్లిక్గా చితకబాదిన పోలీసులు.. ఎందుకంటే?