కోల్కతా : బుధవారం నాడు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బాబుల్ సుప్రియో (Babul Supriyo) ప్రకటించారు. ఎల్లుండి లోక్సభ స్పీకర్ను కలిసేందుకు వెళ్తానని, ఆయన సమయం ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా పత్రం సమర్పించి వస్తాననన్నారు. తనను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా 11 మంది కోర్ గ్రూపులో చోటు కల్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బాబుల్ సుప్రియో కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అసన్సోల్ లోక్సభ సభ్యుడు బాబుల్ సుప్రియో.. రెండు రోజుల క్రితం బీజేపీని వీడి మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పంచన చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం నాడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆ మేరకు లోక్సభ స్పీకర్ను సమయం కోరినట్లు వెల్లడించారు. తాను రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నానని గతంలోనే ప్రకటించానని.. అయితే, ఇలాంటి అవకాశం ఛాలెంజ్గా ఉన్నదని, తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పాడు. పార్టీ మారడం ద్వారా చరిత్ర సృష్టించాలని అనుకోవడం లేదని అన్నారు. బీజేపీలో తనను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ నుంచి తప్పుకుని టీఎంసీలో చేరానని పేర్కొన్నారు. ఏడేండ్లుగా రాజకీయాల్లో ఉన్న తనకు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టముండదని, అందుకే రాజకీయాలను తప్పుకోవాలనుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు.
విజయవాడ కంపెనీ కంటైనర్లలో డ్రగ్స్.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి దిగుమతి !
మహిళ చేతిలో పోలీసు నిలువుదోపిడి.. ఎలాగంటే..?
ఒకవైపు తాలిబాన్పై ప్రశంసలు.. మరోవైపు బైడెన్కు మద్దతు
ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
పేదల కార్లలో ఎయిర్బ్యాగ్స్ పెంచాలి: గడ్కరీ
బ్రిటన్ చిన్నారుల్లో కరోనా వ్యాప్తి
119 అశ్లీల చిత్రాలను నిర్మించి.. 9 కోట్లకు అమ్మాలనుకున్నాడు
ముగిసిన కోవింద్ సిమ్లా పర్యటన
సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..