హిసార్ : (Woman extorts) పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. ప్రేమించిన వ్యక్తి పెండ్లి అనగానే ముఖం చాటేస్తున్నాడని.. ఆడపిల్ల పుట్టిందని ఇంటి నుంచి గెంటేశాడని.. ఇలా ఎన్నో రకాలుగా మహిళలు పోలీసు కేసులు పెట్టడం మనం చూస్తుంటాం. అయితే, హర్యానాలోని ఓ మహిళ మాత్రం.. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లైంగికదాడి చేశావని కేసు పెడతానని ఓ వ్యక్తిని బెదిరిస్తున్నది. ఇప్పటికే రెండుస్లారు ఆయన నుంచి రూ.2.5 లక్షలు వసూలు చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి బెదిరింపులకు దిగి ఏకంగా రూ.25 లక్షలు ఇవ్వాలంటున్నది. ఇంతకీ ఈ మహిళ బ్లాక్మెయిల్ చేస్తున్నది ఎవరినో తెలుసా..?
హర్యానాలోని హిసార్ జిల్లా మిర్చ్పూర్ గ్రామానికి చెందిన మానిమ్ సరోహా అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి చదువుకునేందుకు 2019 లో గనౌర్లోని బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ పరిచయమైన ఓ యువతి ఈయనతో చనువుగా ఉండేది. ఇంతలో సరోహాకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చి ఫరిదాబాద్లోని సూరజ్కుండ్ పోలీస్స్టేషన్లో పోస్టింగ్ దొరికింది. ఇంతలో సరోహాకు తారసపడిన ఆ యువతి.. తనకు డబ్బు ఇవ్వకపోతే తనపై లైంగికదాడి చేశావని పోలీసు కేసు పెడతానని బెదిరించి అన్నంత పని చేసింది. ఆ యువకుడు రెండుస్లారు మొత్తం రూ.2.5 లక్షలు ముట్టజెప్పడంతో ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నది. ఇటీవల మరోసారి యువకుడికి ఫోన్ చేసిన సదరు మహిళ.. ఈసారి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టింది. విసిగిపోయిన సరోహా.. నార్నంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో సదరు మహిళపై ఐపీసీ 389, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఒకవైపు తాలిబాన్పై ప్రశంసలు.. మరోవైపు బైడెన్కు మద్దతు
ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
పేదల కార్లలో ఎయిర్బ్యాగ్స్ పెంచాలి: గడ్కరీ
బ్రిటన్ చిన్నారుల్లో కరోనా వ్యాప్తి
119 అశ్లీల చిత్రాలను నిర్మించి.. 9 కోట్లకు అమ్మాలనుకున్నాడు
ముగిసిన కోవింద్ సిమ్లా పర్యటన
సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..