న్యూఢిల్లీ : ధనవంతుల కార్లలో 8 ఎయిర్బ్యాగ్స్ ఉన్నప్పుడు, పేదల కార్లకు ఎందుకు ఉండవని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin Gadkari) ప్రశ్నించారు. చిన్నకార్లను కొనేవారు ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వారే ఉంటున్నందున, వారికి కూడా భద్రత కల్పించేలా చిన్న కార్లలో కూడా 6 ఎయిర్బ్యాగ్స్ ఉండేలా ఆటోమొబైట్ కంపెనీలు చర్యలు తీసుకోవాలి అని ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. 2021 ఏప్రిల్ 1 నుంచి అన్ని కొత్త కార్లలో 2 ఎయిర్బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రతపై కమిటీ సూచన మేరకు మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.
‘చిన్న కార్లను ఎక్కువగా దిగువ, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తారు. వారి కార్లలో ఎయిర్బ్యాగ్లు లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు వారు చనిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో కార్ల తయారీదారులందరూ తమ అన్ని రకాల కార్లలో కనీసం 6 ఎయిర్బ్యాగ్లను అందించమని విజ్ఞప్తి చేస్తాను’ అని చెప్పారు. ఎయిర్బ్యాగ్స్ సంఖ్య పెంచడం వల్ల కారు ధర రూ.3,000-4,000 వరకు పెరిగినప్పటికీ.. వారికి కూడా పూర్తి రక్షణ లభిస్తుంది కదా అని పేర్కొన్నారు. అధిక పన్నులు, కఠినమైన భద్రతా నియమాల కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమ తమ ఉత్పత్తులు ఖరీదైనవిగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో నితిన్ గడ్కరీ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
బ్రిటన్ చిన్నారుల్లో కరోనా వ్యాప్తి
119 అశ్లీల చిత్రాలను నిర్మించి.. 9 కోట్లకు అమ్మాలనుకున్నాడు
ముగిసిన కోవింద్ సిమ్లా పర్యటన
సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..