అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున హెరాయిన్ (Heroin Seized) పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.9,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. టాల్కం పౌడర్ పేరుతో మత్తు మందులను దిగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఈ హెరాయిన్ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంటైనర్ల ద్వారా భారతదేశానికి చేరవేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
గుజరాత్లోని ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. ముంద్రా పోర్టుకు వచ్చిన కంటైనర్లలో హెరాయిన్ సరఫరా అవుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక కంటైనర్ నిండా హెరాయిన్ వచ్చినట్లు గుర్తించారు. ఈ హెరాయిన్ కంటైనర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. తదుపరి విచారణ కోసం అధికారులు సరుకును స్వాధీనం చేసుకున్నారు. టాల్కం పౌడర్ ముసుగులో కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్లు డీఆర్ఐ అధికారులు కనుగొన్నట్లు తెలుస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్న ఆషి ట్రేడింగ్ సంస్థ ఈ కంటైనర్లను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరుకును టాల్కం పౌడర్ను సంస్థ ప్రకటించినట్లు అధికారులు చెప్తున్నారు. ఎగుమతి సంస్థ హసన్ హుస్సేన్ లిమిటెడ్గా గుర్తించారు. ఐదు రోజులుగా డీఆర్ఐ అధికారులతోపాటు కస్టమ్స్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి చివరకు భారీ ఎత్తున దిగుమతి అయిన డ్రగ్స్ను పట్టుకున్నారు.
మహిళ చేతిలో పోలీసు నిలువుదోపిడి.. ఎలాగంటే..?
ఒకవైపు తాలిబాన్పై ప్రశంసలు.. మరోవైపు బైడెన్కు మద్దతు
ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
పేదల కార్లలో ఎయిర్బ్యాగ్స్ పెంచాలి: గడ్కరీ
బ్రిటన్ చిన్నారుల్లో కరోనా వ్యాప్తి
119 అశ్లీల చిత్రాలను నిర్మించి.. 9 కోట్లకు అమ్మాలనుకున్నాడు
ముగిసిన కోవింద్ సిమ్లా పర్యటన
సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..