కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో ఉదయం 11.05 గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్లో మొత్తం 8 విడుతల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ నాలుగో విడుత పోలింగ్ జరుగుతున్నది. ఇప్పటికే సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అసోంలో మూడు విడుతల్లో పోలింగ్ జరుగగా.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడుతలో పోలింగ్ ముగిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు
ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
ప్లే గ్రౌండ్లో మిస్సైల్.. షాకైన పిల్లలు..!
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్