Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఉదయం 9 గంటల వరకూ పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అత్యధికంగా 16.64 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇక ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) 12.33 శాతం, బీహార్లో 9.66 శాతం, హర్యానాలో 8.31 శాతం, జమ్మూ కశ్మీర్లో 8.89 శాతం, ఝార్ఖండ్లో 11.74 శాతం, ఢిల్లీలో 8.94 శాతం, ఒడిశాలో 7.43 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు.
Also Read..
Lok Sabha Elections | ప్రశాంతంగా కొనసాగుతున్న ఆరోవిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Droupadi Murmu | ఢిల్లీలో ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
PM Modi: ప్రతి ఓటు విలువైనది: ప్రధాని మోదీ