Gautam Adani : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ (Prayagraj) లో కన్నుల పండువగా మహా కుంభమేళా (Maha Kumbh) జరుగుతున్నది. రోజుకు కోటి మందికిపైగా భక్తులు ఈ మహా కుంభమేళాకు తరలివస్తున్నారు. తొలి 8 రోజుల్లోనే 8.81 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తాజాగా అదానీ గ్రూప్ (Adani Group) ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) మహా కుంభమేళాకు వెళ్లారు. అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహా కుంభమేళాలో ఇస్కాన్ టెంపుల్ (ISKCON Temple) వాళ్లు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ క్యాంపులో అదానీ తన సేవలు అందించారు. ప్రసాదం తయారీలో ఆయనలో పాల్గొన్నారు. ఇస్కాన్ టెంపుల్ వారితో కలిసి ఆయన ఈ సేవ చేశారు. కుంభమేళా జరిగినన్ని రోజులు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కూడా తమ క్యాంపులో ప్రసాద వితరణ జరుగుతుందని ఇస్కాన్ టెంపుల్ వారు తెలిపారు. గౌతమ్ అదానీ ప్రసాద తయారీ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Prayagraj, Uttar Pradesh: Adani Group Chairman, Gautam Adani performs ‘seva’ at the camp of ISKCON Temple at #MahaKumbhMela2025
The Adani Group and ISKCON have joined hands to serve meals to devotees at the Maha Kumbh Mela in Prayagraj. The Mahaprasad Seva is being… pic.twitter.com/N1a1qGtS0b
— ANI (@ANI) January 21, 2025
Flying Past rehearsals | గణతంత్ర వేడుకల ముందు ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్.. Videos
DRO Rummy Game | సమావేశంలో డీఆర్వో ఆన్లైన్ రమ్మీ గేమ్ వైరల్.. విచారణకు కలెక్టర్ ఆదేశం
Kiran Abbavaram | తండ్రి కాబోతున్న టాలీవుడ్ యువ హీరో
Spondylosis | డిస్క్లు జారిపోవద్దు.. జాగ్రత్త!