జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్
ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి
బేల, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆలోచన విధానాలు చాలా గొప్పవని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రంతో పాటు కోగ్దూర్ గ్రామంలో బుద్ధవిహార్లో బుధవారం ఆయన విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఇంద్రశేఖర్, గంభీర్ ఠాక్రే, తేజ్రావు, మంగేశ్ ఠాక్రే, బిక్కన్, గజానన్, శుభం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఎదులాపురం, ఏప్రిల్ 14: జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు చిక్కాల దత్తు, ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖాత్రి, ఉద్యోగుల సంఘం నాయకులు పిల్లి కిషన్, రాష్ట్ర నాయకుడు జక్కుల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
స్వేరోస్ ఆధ్వర్యంలో..
స్వేరోస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్వేరోస్ అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, నాయకులు దీపక్, వెంకటి పాల్గొన్నారు.
రెండవ బెటాలియన్లో..
ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ రెండో బెటాలియన్లో నిర్వహించిన వేడుకల్లో కమాండెంట్ ఆర్ వేణుగోపాల్, అసిస్టెంట్ కమాండెంట్ ప్రసాద్, రిజర్వ్ సీఐ, ఎస్ఐ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 14: అంకోలిలో సర్పంచ్ భూమన్న, తంతోలిలో హనుమాన్, జై హనుమాన్ యూత్ క్లబ్ సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, వార్డుసభ్యులు, యువజన సంఘాల ప్రధాన కార్యదర్శి అజయ్, సభ్యులు సాయి ప్రశాంత్, వెంకటేశ్, సాయి పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓపెన్స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, కోఆర్డినేటర్ నర్సయ్య, ఏఎస్వో మహేందర్ రెడ్డి, శ్రీహరి, డీఈవో సీసీ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఆర్టీసీలో..
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 14: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం, ఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆర్ఎం విజయభాస్కర్, డీవీఎం రమేశ్, డిపో మేనేజర్ ఎస్ జనార్దన్, మెకానికల్ ఫోర్మెన్ రాజేందర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
తాంసి, ఏప్రిల్ 14: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్చౌహాన్, శాస్త్రవేత్తలు డాక్టర్ మోహన్దాస్, ఎం మహేశ్, ఏఈవో సుమిత్కుమార్, రికార్డు అసిస్టెంట్ దేవానంద్, వై రవి, సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్, ఏప్రిల్ 14: మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఎంపీపీ గోవర్ధన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యవసాయ కార్యాలయంలో ఏవో వివేక్, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, కార్యదర్శులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ టీ వెంకట్రెడ్డి, సర్పంచ్ దేవన్న, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉట్నూర్/ ఉట్నూర్రూరల్, ఏప్రిల్ 13: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐటీడీఏ ఏపీవో జనరల్ కనక భీంరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలోని గార్డెన్లో, సాహితీ వేదిక ఆధ్వర్యంలో, గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ఇంజినీరింగ్ ఈఈ రాథోడ్ భీంరావు, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మనోహర్, పీహెచ్వో రమణ, ఏసీఎంవో జగన్, బీఈడీ ప్రిన్సిపాల్ మనోహర్, ఏవో రాంబాబు, సాహితీ వేదిక అధ్యక్షడు కొండగుర్ల లక్ష్మయ్య, బంకట్లాల్, వినోద్, జ్ఞానేశ్వర్, ప్రశాంత్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.