Loksabha Elections 2024 | కాషాయ పార్టీ విపక్ష నేతలే లక్ష్యంగా వేధించడం పనిగా పెట్టుకుందని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ అక్రమాలకు తెరలేపిందని విమర్శించారు. అధికారుల అండతో బీజేపీ నేతలు విపక్షాలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారని అన్నారు.
కాషాయ పాలనలో విపక్ష నేతలపై విచారణలతో వేధింపుల పర్వం సాగుతోందని దుయ్యబట్టారు. విపక్ష నేతలకు 107, 117 సీఆర్పీసీ కింద రెడ్ కార్డులు జారీ చేస్తున్నారని, తాను దీనిపై ఎన్నికల కమిషన్కు లేఖ రాశానని ఆయన వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు రాకూడదని, ప్రచారం చేయరాదని పోలీసులు విపక్ష నేతలను బెదిరిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
విపక్ష నేతలకు మాత్రమే రెడ్ కార్డులు జారీ చేస్తున్న పోలీసులు పాలక పార్టీ నేతలను మాత్రం అడ్డుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా తమ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేరని యూపీలో ఎన్నికలు సమాజ్వాదీ పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :
MBBS Student | నీట్ యూజీ.. అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ఎంబీబీఎస్ స్టూడెంట్