న్యూఢిల్లీ: కరోనా గాలి ద్వారానే వ్యాపిస్తోందన్న లాన్సెట్ అధ్యయనంపై ట్విటర్లో స్పందించారు అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఫహీమ్ యూనస్. దీనికి పరిష్కారం మామూలు బట్టతో చేసిన మాస్క్లు ధరించడం కంటే ఎన్95 లేదా కేఎన్95 మాస్క్లు ధరించడమే అని ఆయన స్పష్టం చేశారు. రెండు మాస్క్లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని ఆయన సూచించారు.
లాన్సెట్ అధ్యయనం చూసి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ స్పెక్ట్రం (తుంపర్ల నుంచి గాలి ద్వారా)లో వ్యాపిస్తుందని మనకు తెలుసు. దీనికి పరిష్కారం ఒక ఎన్95, ఒక కేఎన్95 మాస్కులు ధరించడమే. వీటిని ఒక్కో రోజు ఒక్కొక్కటి వాడండి. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగ్లో ఉంచి ఆ మరుసటి రోజు వాడాలి. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవ్చు. బట్టతో చేసిన మాస్క్లు వద్దు అని ఫహీమ్ యూనస్ ట్వీట్ చేశారు.
గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తున్నంత మాత్రాన మన బయట ఉన్న గాలి మొత్తం కలుషితం అయిపోయిందని కాదు. దీనర్థం వైరస్ గాల్లోనే ఉండే అవకాశం ఉన్నదని. ముఖ్యంగా నాలుగు గోడల మధ్య ఈ ముప్పు ఎక్కువ. ఒకవేళ ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఉంటే మన పార్కులు, బీచ్లు మాస్కులు పెట్టుకోకుండా కూడా చాలా సురక్షితం అని యూనస్ చెప్పడం విశేషం.
Lancet study:
— Faheem Younus, MD (@FaheemYounus) April 17, 2021
“Airborne” does NOT mean outside air is contaminated. It means the virus may remain suspended in the air — typically in indoor settings —and pose a risk
Our parks and beaches are still the safest places to enjoy without a mask (provided 6 ft distance)
ఇవి కూడా చదవండి
IPL 2021: సన్రైజర్స్కు మరో షాక్.. స్టార్ బౌలర్కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
కుంభమేళాకు వెళ్లినవారికి క్వారంటైన్ తప్పనిసరి
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్కు కరోనా