Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు (terrorists) మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో రాజౌరి ( Rajouri ) జిల్లాలోని కండి ఫారెస్ట్ ప్రాంతంలో ( Kandi Forest area) భద్రతా బలగాలు శుక్రవారం జాయింట్ ఆపరేషన్ (joint operation) చేపట్టాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు. ఈ పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఓ అధికారి సహా నలుగురికి గాయాలైనట్లు తెలిపారు. గాయపడినవారిని వెంటనే ఉదంపూర్లోని కమాండ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
SCO dinner | ఎస్సీవో విందులో ఆసక్తికర పరిణామం.. పాక్ మంత్రితో జయశంకర్ షేక్హ్యాండ్
Meesho Lay Off | ఉద్యోగులకు మీషో మరోసారి షాక్.. 251 మందికి ఉద్వాసన
DRDO Scientist Arrest | పాక్కు భారత రహస్య సమాచారం లీక్ చేసిన శాస్త్రవేత్త అరెస్ట్