Earthquake | బంగ్లాదేశ్ (Bangladesh)లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చిట్టగాంగ్లో (Chittagong) భూ అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
బెంగాల్లోని కోల్కతా (Kolkata) సహా పలు ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ప్రకంపనల కారణంగా రాష్ట్రంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పశ్చిమ బెంగాల్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ‘ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు.. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు’ అని అధికారులు తెలిపారు. కోల్కతా పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
కాగా, శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్లోని రామ్గంజ్లో భూమి కంపించింది (Earthquake). రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. రామ్గంజ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. నిమిషాల వ్యవధిలో చిట్టగాంగ్ ప్రావిన్స్లోని లక్ష్మీపూర్, చాంద్పూర్, కొమిల్లాలో భూమి కంపించిందని పేర్కొంది. అదేవిధంగా రాజ్షాహి, సిల్హెట్, ఢాకా (Dhaka), నొవాఖలి, కుష్తియాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయని చెప్పింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
Also Read..
Heart Attack | కలచివేస్తున్న గుండెపోటు మరణాలు.. గుజరాత్లో 6 నెలల్లో 1,000 మంది మృతి
Two Planes Crash | ఒకే రన్వేపై గంటల వ్యవధిలోనే ప్రమాదానికి గురైన రెండు విమానాలు.. వీడియో
Ugandan woman | 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఉగాండా మహిళ.. తొలి మహిళగా రికార్డు