farm lawsChronology of Farmers protest | ఎట్టకేలకు రైతులు విజయం సాధించారు. ఏడాదికి పైగా ఎండ, వాన, చలి లెక్క చేయకుండా మొక్కవోని ధైర్యంతో చేసిన ఉద్యమానికి ప్రతిఫలం దక్కింది. ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, నిరాహర దీక్షలు అంటూ అన్నదాతలు చేసిన నిరసన పోరాటలకు కేంద్రం దిగొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాల రూపకల్పన ఎప్పుడు మొదలైంది? ఆ తర్వాత బిల్లుల ఆమోదం నుంచి రైతుల నిరసన.. చివరకు మోదీ ప్రకటన వరకు ఏ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..
2020 జూన్ 5
కొత్త వ్యవసాయ చట్టాల రూపకల్పన
2020 జూన్ 15
కొత్త వ్యవసాయ చట్టాలపై ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన కేంద్రం
2020 సెప్టెంబర్ 14
పార్లమెంట్లో వ్యవసాయ బిల్లు ప్రవేశ పెట్టిన మోదీ ప్రభుత్వం
2020 సెప్టెంబర్ 17
మూడు వ్యవసాయ బిల్లులకు లోక్సభ ఆమోదం
2020 సెప్టెంబర్ 20
రాజ్యసభలో మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం
2020 సెప్టెంబర్ 27
మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించిన రాష్ట్రపతి
2020 నవంబర్ 26
వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమం.. ఛలో ఢిల్లీ.. ఆందోళనలో పాల్గొన్న 40కి పైగా రైతు సంఘాలు
2020 నవంబర్ 28
కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
2020 డిసెంబర్ 3
రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొలి విడుత చర్చలు
2020 డిసెంబర్ 5
రెండోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం
2020 డిసెంబర్ 8
వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గని కేంద్రం.. భారత్బంద్కు రైతు సంఘాల పిలుపు
2020 డిసెంబర్ 9
వ్యవసాయ చట్టాల సవరణ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు
2020 డిసెంబర్ 11
కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతు సంఘాలు
2020 డిసెంబర్ 13
వ్యవసాయ చట్టాలపై మరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
2020 డిసెంబర్ 16
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ.. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న సుప్రీంకోర్టు
2020 డిసెంబర్ 21
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరాహార దీక్ష
2020 డిసెంబర్ 30
రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆరో విడత చర్చలు, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్, గడ్డి తగులబెట్టడంపై జరిమానా వంటివి తీసేస్తామని కేంద్రం హామీ
2021 జనవరి 4
రైతులతో ఏడోసారి కేంద్ర ప్రభుత్వం చర్చలు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల వినతిని తిరస్కరించిన కేంద్రం
2021 జనవరి 7
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణకు అంగీకారం తెలిపిన సుప్రీంకోర్టు
2021 జనవరి 11
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. చట్టాలను తీసుకొచ్చిన తీరుపై సీరియస్ అయిన సర్వోన్నత న్యాయస్థానం
2021 జనవరి 12
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
2021 జనవరి 15
రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో దఫా చర్చలు విఫలం
2021 జనవరి 20
మరోసారి రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు.. మూడు వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలివేసి, చట్టంపై చర్చించేందుకు ఉమ్మడి కమిటీ వేయాలని ప్రతిపాదన.. తిరస్కరించిన రైతులు
2021 జనవరి 26
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రైతుల ఆందోళన.. ఉద్రిక్తతకు దారి తీసిన వైనం
2021 జనవరి 28
ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దులో రైతుల ఆందోళనలు మొదలు.. ఢిల్లీలోకి రైతులు రాకుండా ఘజియాబాద్ వద్ద రాత్రికి రాత్రే ఉద్యమాన్ని విరమించి వెళ్లిపోవాలని ఆర్డర్ వేసిన ప్రభుత్వం
2021 ఫిబ్రవరి 5
రైతు ఉద్యమంపై సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
2021 ఫిబ్రవరి 6
చక్కా జామ్ పేరిట దేశవ్యాప్తంగా రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్భంధించిన రైతులు
2021 ఫిబ్రవరి 8
రైలు రోకో చేపట్టిన అన్నదాతలు
2021 ఫిబ్రవరి 9
పంజాబీ నటుడు దీప్ సింధు కార్యకర్తగా మారి గణతంత్ర దినోత్సవం రోజున రైతు ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అరెస్టు చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.. ఏడు రోజుల పాటు కస్టడీ
2021 ఫిబ్రవరి 18
దేశ వ్యాప్తంగా రైలు రోకోకు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా
2021 మార్చి 2
సెక్టార్ 25 నుంచి పంజాబ్ విధానసభ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, ఇతర పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్న చండీగఢ్ పోలీసులు
2021 మార్చి 5
రైతులు, పంజాబ్ ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ చట్టాలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని తీర్మానం ఆమోదించిన పంజాబ్ విధాన సభ
2021 మార్చి 6
కొత్త వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం రైతులు చేపట్టిన ఉద్యమానికి వంద రోజులు పూర్తి
2021 ఏప్రిల్ 15
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులతో చర్చలను పునః ప్రారంభించాలని, సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా
2021 ఏప్రిల్ 26
దీప్ సిద్దూకి రెండోసారి బెయిల్ మంజూరు
2021 మే 21
మూడు వ్యవసాయ చట్టాలపై చర్చలను పునః ప్రారంభించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంయుక్త కిసాన్ మోర్చా
2021 మే 27
ఆరు నెలల ఆందోళనలకు గుర్తుగా బ్లాక్ డే పాటిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేసిన రైతులు
2021 జూన్ 5
కొత్త వ్యవసాయ చట్టాలను ప్రకటించి ఏడాది పూర్తి.. దీనికి గుర్తుగా నిరసనలు తెలుపుతూ సంపూర్త క్రాంతికారి దివస్గా పాటించిన రైతులు
2021 జూన్ 26
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఏడు నెలలకు నిరసనకు నిదర్శనంగా ఢిల్లీ మార్చ్
2021 జూలై 22
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ సన్సద్ ప్రారంభం.. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంపై రైతుల చర్చలు
2021 ఆగస్టు 7
14 ప్రతిపక్ష పార్టీల నాయకులతో పార్లమెంట్ హౌస్లో సమావేశం..
2021 ఆగస్టు 28
కర్నాల్ నిరసన ప్రదేశంలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్
2021 సెప్టెంబర్ 7
పెద్ద ఎత్తున కర్నాల్ ప్రదేశానికి చేరుకుని మినీ సెక్రటేరియట్ను ముట్టడించిన రైతులు
2021 సెప్టెంబర్ 17
మూడు వ్యవసాయ చట్టాలు ఆమోదం పొంది ఏడాది పూర్తయినందుకు నిరసనగా భారత్ బంద్ పాటించిన రైతు సంఘాలు
2021 నవంబర్ 19
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటన
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన
కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాల్లో ఏముంది? వాటిని రైతులు ఎందుకు అంతలా వ్యతిరేకించారు?
సాగు చట్టాల రద్దు వ్యూహాత్మకమా? రాజకీయమా?
మోదీపై విశ్వాసం లేదు..రైతుల ఉద్యమం కొనసాగిస్తాం : రాకేష్ తికాయత్
కొత్త సాగు చట్టాలు రద్దు.. ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్ సీఎంలు ఏమన్నారంటే?
అవిశ్రాంత పోరాటంతో రైతులు విజయం సాధించారు: మంత్రి కేటీఆర్
కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారు: మంత్రి హరీశ్ రావు
మహాధర్నా ఫలితంగానే సాగు చట్టాల రద్దు: మంత్రి ఎర్రబెల్లి
MK Stalin: ఇది రైతులు సాధించిన అద్భుత విజయం: తమిళనాడు సీఎం