Bye Elections | లోక్సభ ఎన్నికల హడావుడి ముగిసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసే పనిలోపడింది. ఈ నేపథ్యంలో మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు (13 Assembly Constituencies) ఉప ఎన్నికలు (Bye Elections) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను సోమవారం ప్రకటించింది.
బీహార్ (1), పశ్చిమ బెంగాల్ (4), తమిళనాడు (1), మధ్యప్రదేశ్ (1), ఉత్తరాఖండ్ (2), పంజాబ్ (1), హిమాచల్ ప్రదేశ్ (3) రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10న ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్ 14న గెజిట్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. జూన్ 21వ తేదీ శుక్రవారం ఎన్నికల నామినేషన్కు ఆఖరి తేదీ అని పేర్కొంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 26వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపింది. జులై 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
The Election Commission of India has decided to hold bye-elections to fill vacancies in 13 Assembly Constituencies in Bihar, West Bengal, Tamil Nadu, Madhya Pradesh, Uttarakhand, Punjab, and Himachal Pradesh.
Elections will be conducted on 10th July and the counting will be done… pic.twitter.com/ihhJpfoko3
— ANI (@ANI) June 10, 2024
Also Read..
PM Modi | ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం
Sonakshi Sinha | పెళ్లి పీటలెక్కబోతున్న హీరామండి నటి..!
Cabinet Meeting | పీఎం ఆవాస్ యోజన సాయం 50 శాతం పెంపు.. అదనంగా 2 కోట్ల గృహాలు..?