Formers protest | పంటలకు కనీస మద్దతు ధర అంశంలో రైతులు కేంద్రంపై మరోమారు దండయాత్ర ప్రారంభించారు (Formers protest). ఛలో ఢిల్లీ పేరిట తమ నిరసనను నేడు తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా శంభు సరిహద్దు (Shambhu border) వద్దకు భారీగా చేరుకొని రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు రాజధానిలోకి ప్రవేశించకుండా ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు.
అయితే ట్రాక్టర్ల సాయంతో బారికేడ్లను తొలగించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు మరోమారు టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, రైతులపై హర్యానా పోలీసులు ఇప్పటికే ఓసారి టియర్ గ్యాస్ ప్రయోగించిన విషయం తెలిసిందే.
మరోవైపు పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని వాపోతున్నారు. తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనకూ అనుమతివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు.
शंभू बॉर्डर पर मची अफरा-तफरी ! आंसू गैस के गोलों के जोरदार धमाके, देखें क्या बने हुए हालात…#shambhuborder #farmerprotest #farmerprotest2024 #kisaanandolan #teargas #punjabkisan pic.twitter.com/GvxdGIKYW2
— Punjab Kesari-Punjab (@KesariPunjab) February 21, 2024
किसानों के प्रदर्शन की शुरुआत 13 फरवरी को हुई थी। अभी किसान पंजाब-हरियाणा के शंभू बॉर्डर पर डटे हुए हैं। दिल्ली कूच करने की कोशिश कर रहे किसानों पर पुलिस ने आंसू गैस के गोले दागे हैं।#FarmersProtest2024 #Punjab #ShambhuBorder #DelhiBorder #TearGas #MSP https://t.co/HcNBlMIkJx pic.twitter.com/tqHHCBhKni
— Gaon Junction (@gaonjunctionofc) February 21, 2024
Also Read..
Formers protest | ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తం.. రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం
Food Poisoning | ప్రసాదం తిన్న 500 మందికి అస్వస్థత.. ఆసుపత్రిలో పడకల కొరతతో రోడ్డుపైనే చికిత్స