MSP : కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పిస్తే రైతులు ఆందోళన విరమిస్తారని పంజాబ్ కిసాన్ మజ్దూర్ ప్రధాన కార్యదర్శి శర్వన్ సింగ్ పాంథర్ బుధవారం పునరుద్ఘాటించారు. రైతులందరూ ఢిల్లీ ఛలో ప్రదర్శనలో ముందుకుసాగరని, కేవలం రైతు నాయకులే దేశ రాజధానికి ప్రదర్శనగా తరలివస్తారని చెప్పారు.
రైతులెవరూ ప్రదర్శనలో పాల్గొనబోరని, రైతు నేతలే ముందుండి ప్రదర్శన నిర్వహిస్తారని మన సైనికులపై తాము దాడి చేయబోమని ఆయన స్పష్టం చేశారు. శాంతియుతంగా తాము ప్రదర్శన చేపడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీపై చట్టం తీసుకువస్తే ఈ ఆందోళన అంతా సమసిపోతుందని తేల్చిచెప్పారు. రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలని దేశ యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇక రైతుల సమస్యలపై చర్చలు జరపాలని, రైతుల ఛలో ఢిల్లీ ప్రదర్శన శాంతియుతంగా సాగేందుకు అనుమతించాలని అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో తాము అన్ని సమావేశాలకు హాజరై తమ డిమాండ్లు సహా అన్ని అంశాలు ప్రభుత్వం ముందుంచామని చెప్పారు. ప్రధాని చొరవచూపి తమ డిమాండ్లు అంగీకరించాలని కోరారు. దేశ జనాభాలో 80 శాతం ఉన్న రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
Read More :