Gujarat | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో విద్యాశాఖలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ 300కిపైగా ప్రభుత్వ పాఠశాలలు ఒకే తరగతి గది (Single Classroom)తో నడుస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో వెల్లడించింది.
రాష్ట్రంలో 2023 డిసెంబర్ నాటికి మొత్తం 341 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (Government Schools) ఒకే తరగతి గదితో నడుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ (Kuber Dindor) అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరీట్ పటేల్ ( Kirit Patel) విద్యాశాఖపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను కూల్చివేయడం, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటం, కొత్త తరగతి గదులు నిర్మించేందుకు స్థలం లేకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు. కొత్త తరగతి గదులను వీలైనంత త్వరగా నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా విభాగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాల ఖాళీల గురించి ఎమ్మెల్యే కిరీట్ పటేల్ ప్రశ్నించారు. దీనికి కుబేర్ సమాధానమిస్తూ.. 2023 డిసెంబర్ నాటికి గుజరాత్ ఎడ్యుకేషన్ సర్వీస్ కేడర్లోని క్లాస్-1, క్లాస్-2ల్లో 1,459 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 781 పోస్టులు బర్తీ చేసినట్లు వివరించారు.
Also Read..
Ameen Sayani | దిగ్గజ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత
Virat Kohli | భారత్ హాయిగా నిద్రపోతుంది.. విరుష్క జంటకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీబీ
Medaram Jathara | సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం.. మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్