విద్యార్థులకు శుభవార్త చెప్పిన తమిళనాడు ప్రభుత్వం

- జనవరి నుంచి ఏప్రిల్ వరకు రోజుకు 2జీబీ మొబైల్ డేటా ఉచితం
చెన్నై: తమిళనాడు విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ రోజుకు 2జీబీ చొప్పున మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. విద్యార్థులు ఈ రోజు నుంచి వచ్చే ఏప్రిల్ మాసాంతం వరకు ఈ ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం చెప్పారు.
కొవిడ్ -19 విస్తరణ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా ప్రభావం ఇప్పటికీ పూర్తిగా తగ్గకపోవడంతో ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. తమిళనాడులో యూజీ, పీజీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమైనా.. ఎక్కువ మంది ఆన్లైన్ పాఠాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ కాలేజీలతోపాటు స్కాలర్షిప్లతో చదువుకునే ప్రైవేట్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత మొబైల్ డేటా ఈ సౌలభ్యం అందించనున్నట్టు ముఖ్యమంత్రి తన ప్రకటనలో వెల్లడించారు. డేటా కార్డులను ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా అందించనున్నారు. ఆన్లైన్ పాఠాలు వినడానికి విద్యార్థులంతా ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవాలని సీఎం పళనిస్వామి కోరారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అవును.. ఆ గబ్బిలాలు మమ్మల్ని కుట్టాయి.. వాటి వల్లే కరోనా!
- మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు..!
- త్రిపుర కాంగ్రెస్ చీఫ్పై బీజేపీ మద్దతుదారుల దాడి ?
- బెంగళూరు వదులుకునే ఆటగాళ్లు వీరే..!
- రైతుల ట్రాక్టర్ ర్యాలీపై రేపు సుప్రీంకోర్టు విచారణ
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు