మహబూబ్నగర్ అర్బన్, మే 7 : మహబూబ్నగర్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యా న్ని కొనేందుకు అధికారులు ముందుకు రావడం లే దని రైతులు తెలుపడంతో శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్య ర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి మంగళవారం మార్కెట్యార్డును సందర్శించి మాట్లాడారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మడానికి తీసుకొస్తే మార్కెట్లో కూడా భద్రత లేదని, కాంగ్రెస్ వస్తే కరువొస్తుందనడానికి ఇ దే నిదర్శనమన్నారు. కేసీఆర్ హయాంలో గిట్టుబాటు ధరతో పొలాల వద్దే పంటను కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్నారు. ప్రభుత్వం స్పందించి పంట కొనుగోలుతోపాటు బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలన్నీ గాలికొదిలేయడంతో ప్రజలు అరిగోస పడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతును రాజును చేస్తే.. కాంగ్రెసోళ్లు మార్కెట్ యార్డుకు తాళాలు వేసి వారిని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. తడిసిన ధాన్యా న్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.