నాగర్కర్నూల్, మే 7 : అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన సీఎం రేవంత్.. ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రచారంలో భాగంగా మంగళవా రం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితో కలిసి తెలకపల్లి రోడ్ షోలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో ఎన్ని లబ్ధిచేకూర్చాయే ప్రజలే ఆలోచించుకొని ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. చాణక్యనీతి సర్వేలో నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని 45 శాతం ఓట్లతో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్లు తేలిందన్నారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.
తాను గురుకులాల కార్యదర్శిగా లక్షలాదిమంది వి ద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి అంతర్జాతీయ ప్రమాణాలతో కూ డిన విద్యను అందించానన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు పోలీసు బందోబస్తు లేకుండా ప్రజల్లోకి రావడం లేదన్నారు. కేసీఆర్ పదేండ్ల నిజమైన పాలనకు, అబద్ధ పు హామీలిచ్చిన కాంగ్రెస్ పాలనకు మధ్య ఎన్నికలు జ రుగుతున్నాయన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు తమ వంతుగా సాయం అందించి, వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల బ లోపేతానికి, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పథకాల అమలు పేరుతో సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ చెప్పే మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మొద్దన్నారు. ర్యాలీలో పార్టీ సీనియర్ నాయకులు నాగం శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.