చండీగఢ్, మే 7: లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఇటీవల ఒడిశాలోని పూరీలో ముందుగా ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థి పొటీ నుంచి తప్పుకోగా.. తాజాగా అలాంటి సీనే చండీగఢ్లో జరిగింది. చండీగఢ్ లోక్సభ స్థానం నుంచి శిరోమణి అకాలీదశ్(ఎస్ఏడీ) అభ్యర్థిగా ఉన్న హర్దీప్ సింగ్ పోటీ నుంచి తప్పుకొన్నారు. పార్టీకి కూడా రాజీనామా చేశారు.