బెంగళూరు: లోక్సభ ఎన్నికలకు ముందు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండెల్ ఆరోపణల కేసుకు సంబంధించి పలువురు మహిళల వీడియోలతో కూడిన 25 వేల పెన్డ్రైవ్లను రాష్ట్రమంతా పంచారని మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల కుట్ర ఉన్నదని ఆయన అన్నారు. ఈ కేసు విచారిస్తున్న సిట్ను ‘సిద్ధరామయ్య, శివకుమార్ ఇన్వెస్టిగేషన్ టీమ్’గా అభివర్ణించారు.
స్పందించిన ఇంటర్పోల్!
ప్రజ్వల్పై జారీచేసిన బ్లూకార్నర్ నోటీసులకు ఇంటర్పోల్ స్పందించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, సిట్ ముందు హాజరయ్యేందుకు ప్రజ్వల్ అడిగిన ఏడు రోజుల సమయం మంగళవారంతో ముగిసింది. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు.