తిరువనంతపురం: కేరళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ నెల 20న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని సీపీఐ (ఎం) క్రియాశీల కార్యదర్శి, లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కన్వీనర్ విజయరాఘవన్ సోమవారం వెల్లడించారు. మే 20న విజయన్తోపాటు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని చెప్పారు.
మొత్తం 21 మంది సభ్యులతో కేరళ మంత్రివర్గం కొలువుదీరనుందని విజయరాఘవన్ తెలిపారు. నూతన క్యాబినెట్లో ఎల్డీఎఫ్ కూటమిలోని ప్రధాన పార్టీ అయిన సీపీఐ (ఎం)కు 12 స్థానాలు, సీపీఐకి నాలుగు స్థానాలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన ఐదు స్థానాల్లో కేరళ కాంగ్రెస్ పార్టీ, జనతాదల్ (ఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పార్టీలకు ఒక్కో బెర్త్ ఖాయం చేసినట్లు చెప్పారు.
మిగతా రెండు క్యాబినెట్ బెర్తులను మొదటి రెండున్నర సంవత్సరాలు జనాధిపత్య కేరళ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లీగ్కు, తర్వాత రెండు సంవత్సరాలు కేరళ కాంగ్రెస్ (బి), కేరళ కాంగ్రెస్ (ఎస్)లకు కేటాయించనున్నట్లు విజయరాఘవన్ తెలిపారు. స్పీకర్ పదవి సీపీఐ (ఎం) చేపట్టనుండగా.. డిప్యూటీ స్పీకర్ పదవిని సీపీఐ, చీఫ్ విప్ పదవిని కేరళ కాంగ్రెస్ (ఎం) చేపట్టనున్నాయన్నారు. ఇక క్యాబినెట్లో ఎవరెవరికీ ఏ శాఖలు కేటాయించాలో పినరయి విజయన్ నిర్ణయిస్తారని చెప్పారు.
భద్రంగా అజ్మీర్లోని ఇజ్రాయెల్ మందిరం
యుద్ధం కొనసాగుతుంది: బెంజిమిన్ నెతన్యాహు
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..