Sushil Modi | బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోదీ (Sushil Modi) బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ (cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ( Lok Sabha elections) పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా తెలియజేసినట్లు సుశీల్ మోదీ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘నేను గత 6 నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను. ఈ కారణంగా లోక్సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. ప్రధాని మోదీకి అన్ని విషయాలూ చెప్పాను. దేశం, బీహార్, పార్టీకి ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేశాను. అందుకు కృతజ్ఞుతుడిని’ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा ।
PM को सब कुछ बता दिया है ।
देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित |— Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024
Also Read..
Priyanka Chopra | దక్షిణాది నటితో ప్రియాంక చోప్రా సోదరుడి నిశ్చితార్థం.. ఫొటోలు షేర్ చేసిన పీసీ
Massive Fire | వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Taiwan | తైవాన్ను వణికించిన శక్తిమంతమైన భూకంపం.. నలుగురు మృతి