Taiwan | తైవాన్ రాజధాని తైపీని శక్తిమంతమైన భూకంపం (Taiwan Eartquake) వణికించింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. భారీ భూకంపం కారణంగా నగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సుమారు వంద మంది గాయపడ్డారని తెలిపింది.
కాగా, దక్షిణ తైవాన్లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని వెల్లడించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్జీఎస్ వెల్లడించింది. భూకంపం ధాటికి పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. తైపీలో చాలా బిల్డింగ్లు పేకమేడల్లా కుప్పకూలపోయాయి. పలు భవనాలకు పగుళ్లు వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
1999 తర్వాత తైవాన్ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని స్థానిక అధికారులు వెల్లడించారు. అప్పుడు నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి సుమారుగా 2,500 మందికి పైగా మరణించారు. 1,300 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత 25 ఏండ్లలో తైవాన్ను తాకిన బలమైన భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు.
తైవాన్లో భూకంపంతో జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్లోని దీవులకు సుమారు 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు 30 నిమిషాల తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ పేర్కొంది. సునామీ వస్తున్నదని, అందరూ ఇండ్లు ఖాళీ చేయాలని జపనీస్ జాతీయ వార్తాసంస్థ ఎన్హెచ్కే ప్రసారం చేస్తున్నది. కాగా, తైవాన్లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. 1996లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది ప్రజలు మరణించారు. ఇక జపాన్లో ప్రతిఏటా సుమారు 1500 భూకంపాలు వస్తుంటాయి.
Also Read..
Annie Raja: రాహుల్ గాంధీపై సీపీఐ అభ్యర్థిగా అన్నే రాజా
TTE | టికెట్ అడిగినందుకు టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసేశాడు
Bijapur Encounter | బీజాపూర్ ఎన్కౌంటర్.. 13కు చేరిన మృతుల సంఖ్య