తిరువనంతపురం: కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. టీటీఈని (TTE) కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ప్రెస్లో (Ernakulam-Palakkad Express) ఈ ఘటన జరిగింది. టీటీఈ వినోద్ తన విధుల్లో భాగంగా రైలులోని ఎస్ 11 బోగీలో ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్ అనే ప్రయాణికుడిని టెకెట్ చూపించమని అడిగారు. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈక్రమంలో ఆగ్రహానికి లోనైనా ఆ ప్రయాణికుడు టీటీఈని రైలులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో అవతలి పట్టాలపై పడిపోయిన వినోద్ను.. అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొనడంతో మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు పాలక్కాడ్ వద్ద నిందితుడు రజనీకాంత్ను పట్టుకున్నారు. అతడు మద్యంమత్తులో ఉన్నాడని అధికారులు తెలిపారు. టీటీఈ వినోద్ ఎర్నాకుళంకు చెందినవారని, ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించారని వెల్లడించారు.