న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి చరమగీతం పాడటం కోసం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉచిత వ్యాక్సినేషన్ ఫలాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరేలా చూడాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ప్రధాని సూచించారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపడంలేదని, అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిందని చెప్పారు. ప్రస్తుతం 45 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారని, మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత