గువాహటి: అసోంలో (Assam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గువాహటిలోని (Guwahati) జలక్బారీ (Jalukbari) ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను విద్యార్థులుగా (Engineering Students) గుర్తించారు. వారంతా అస్సాం ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారని చెప్పారు.
Assam | At least seven dead and several others injured in a road accident that took place in the Jalukbari area of Guwahati on Sunday late night. pic.twitter.com/5gELk04tCR
— ANI (@ANI) May 29, 2023
బెంగళూరు: కర్ణాటకలోని (Karnataka) కుష్తగి తాలూకా (Kushtagi taluk) కల్కేరీ (Kalkeri) గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీ కిందికి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితులంతా విజయపురాకు చెందినవారని, బెంగళూరుకు (Bengaluru) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీ.. తమిళనాడు (Tamil Nadu) నుంచి గుజరాత్ (Gujarat) వెళ్తున్నదని వెల్లడించారు.