భోపాల్: ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్ చేయించుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆ టీచర్ను సస్పెండ్ చేశారు. (Students Massage) మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కార్వి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా మధు కుమారి పనిచేస్తున్నది. అయితే స్కూల్లోని విద్యార్థినులతో ఆమె మసాజ్ చేయించుకున్నది. బాలికలతో నడుము, కాళ్లు, పాదాల వద్ద తొక్కించుకున్నది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యా శాఖ అధికారులు స్పందించారు. ఆ స్కూల్ తనిఖీ కోసం ఒక బృందాన్ని పంపారు. అయితే ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలలో కనిపించలేదు. ఆమె సిక్ లీవ్లో ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు.
మరోవైపు విద్యార్థుల స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ఈ ఆధారాల మేరకు ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. అయితే ఆ వీడియో నకిలీ అని, ఏఐ ఆధారిత వీడియో సృష్టించారని ఆ టీచర్ ఆరోపించింది.
A video showing a government primary school teacher receiving a body massage from students inside a classroom has triggered widespread outrage on social media.
The clip, which has rapidly circulated across multiple platforms, shows several children massaging the teacher using… pic.twitter.com/1r3k7xzBn1
— Hate Detector 🔍 (@HateDetectors) March 6, 2026
Also Read:
Student Stabbed To Death | పరీక్షలో సహకరించనందుకు.. బాలుడిని కత్తితో పొడిచి చంపిన విద్యార్థులు
Woman, Lover Kill Husband | ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ.. ఆ తర్వాత అతడితో పెళ్లి
Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య
Watch: లోతైన బావిలో పడిన ఏనుగు పిల్ల.. ఎలా రక్షించారంటే?