Student | దేశంలో ఇటీవలే కాలంలో విద్యార్థుల (students) ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గుండెపోటు మరణాలు కలచివేస్తున్నాయి. అప్పటి వరకూ బాగానే ఉన్న యువత.. ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా సివిల్ సర్వీస్ (civil services ) పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తన కోచింగ్ సెంటర్లోనే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధీ.. ఇండోర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో లోధీ తన కోచింగ్ సెంటర్లోని క్లాస్ రూమ్ (coaching class)లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకుంటున్న సమయంలో ఛాతీలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు లోధీని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
యువకుడిని పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అయితే, లోధీ మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. గుండెపోటుతోనే లోధీ ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఈ మేరకు అతడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి క్లాస్ రూమ్లో కుప్పకూలుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
इंदौर में PSC की तैयारी कर रहे 18 साल के छात्र की कोचिंग सेंटर में heart attack से हुई मौत। #heartattack #MadhyaPradesh #indore #hindinews #viralvideo #LatestNews #Health #Death #studentlife #webdunia pic.twitter.com/L5Uh7r2vqd
— Webdunia Hindi (@WebduniaHindi) January 18, 2024
Also Read..
12th Fail | గొప్ప సినిమా అనేది కథ నుంచే వస్తుంది.. 12th ఫెయిల్పై ఆనంద్ మహీంద్రా రివ్యూ
Sachin Tendulkar | సచిన్ డీప్ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు
Sivamani | ఎయిర్పోర్ట్లో లగేజీ ఆలస్యం.. కన్వేయర్ బెల్ట్పై డ్రమ్స్ శివమణి ప్రదర్శన.. వీడియో